telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

నాలెడ్జ్‌ ఎకానమీకి అమరావతి కేంద్రం కావలి: చంద్రబాబు

8th white paper released by apcm babu
నాలెడ్జ్‌ ఎకానమీకి ఏపీ రాజధాని అమరావతి కేంద్రం కావాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గురువారం మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థకు ఆయన భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి పలు విద్యాసంస్థల ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతో  దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఎక్స్‌ఎల్‌ఆర్ఐ‌ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతిలో ఈ సంస్థ ఏర్పాటు కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. 
నోయిడా, ముంబై తర్వాత అమరావతిలో నాలుగో క్యాంపస్ అని ఆయన పేర్కొన్నారు. నాలెడ్జ్‌ ఎకానమీ రావాలనే ఏపీకి ఆహ్వానించామన్నారు.  అంతర్జాతీయ స్థాయిలో పాఠశాలలు కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తామన్నారు. కొన్ని దేశాలు తమ పెట్టుబడులను నాలెడ్జ్‌ ఎకానమీపై పెట్టాయని తెలిపారు. మైక్రోసోఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌, ఉబర్‌ వంటివన్నీ వినూత్న ఆలోచనలేనని చంద్రబాబు పేర్కొన్నారు.

Related posts