telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

టీడీపీ శ్రేణులకు శుభవార్త… పరిటాల శ్రీరామ్ కు కీలక పదవి

Sriram to contest from Raptahdu

టీడీపీకి నమ్మిన బంటుగా ఉన్న పరిటాల ఫ్యామిలీకి చంద్రబాబు మరో కీలక పదవిని కట్టబెట్టే యోచనలో ఉన్నారు. పరిటాల రవి హత్య తరువాత రాజకీయాలలోకి వచ్చిన ఆయన భార్య పరిటాల సునీత రాప్తాడు నుంచి గెలిచి చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే మొన్న ఎన్నికలలో పరిటాల సునీత తప్పుకుని కుమారుడు పరిటాల శ్రీరామ్‌ను ఎన్నికల బరిలో నిలిపింది. అయితే వైసీపీ ప్రభంజనంలో తొలిసారిగా పోటీ చేసిన పరిటాల శ్రీరామ్‌ ఓటమి పాలయ్యారు. అయితే ఎన్నికల తరువాత పరిటాల ఫ్యామిలీ బీజేపీ వైపు చూస్తుందని వార్తలు వినిపించాయి. అయితే తాము పార్టీ మారబోమని, టీడీపీలోనే కొనసాగుతామని వారే తేల్చి చెప్పారు. అయితే ఎన్నికల తరువాత ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి టీడీపీని వీడి బీజేపీలో చేరడంతో ధర్మవరం బాధ్యతలను కూడా చంద్రబాబు పరిటాల కుటుంబానికే వదిలేశారు. అంతేకాదు రాబోయే ఎన్నికలలో రాప్తాడు, ధర్మవరం రెండు నియోజకవర్గాలలో పరిటాల ఫ్యామిలీనే పోటీ చేసుకోమని హామీ ఇచ్చారు. అయితే ఇటీవల దేవినేని అవినాష్ వైసీపీలో చేరడంతో, గతంలో ఆయన నిర్వహించిన తెలుగు యువత అధ్యక్ష పదవిని పరిటాల శ్రీరామ్‌కి అప్పగించాలని అధిష్టానం భావిస్తుందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related posts