telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బాధ్యులైన ఒక్కరినీ కూడా అరెస్ట్ చేయలేదు: చంద్రబాబు ఫైర్

chandrababu

వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనకు బాధ్యులైన ఒక్కరినీ కూడా అరెస్ట్ చేయలేదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఈ దుర్ఘఘటనపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. ఈ ఘటనతో భయబ్రాంతులకు గురైన విశాఖ ప్రజలు రోడ్లపైనే పడుకుంటున్నారని తెలిపారు.తమకు న్యాయం చేయాలంటూ స్థానికులు వీధుల్లోకి వచ్చి, నిరసనలు తెలుపుతున్నారన్నారు.

ఆప్తులను కోల్పోయిన కుటుంబాలు తమవారి మృతదేహాల పక్కన దీనంగా రోదిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఘటనకు బాధ్యులైన ఒక్కరినీ అరెస్ట్ చేయలేదని, కనీసం ఒక్క ఆస్తిని కూడా జప్తు చేయలేదని చంద్రబాబు మండిపడ్డారు. ఇంతకీ వైఎస్ జగన్ ఎక్కడున్నాడు? అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Related posts