telugu navyamedia
రాజకీయ వార్తలు

అరుణ్ జైట్లీకి .. ఢిల్లీలో .. చంద్రబాబు నివాళులు ..

new alcohol policy made shop rent 1 rupee

టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీకి నివాళులు అర్పించారు. ఢిల్లీలోని కైలాష్ నగర్ లో జైట్లీ ఇంటికెళ్లిన చంద్రబాబు.. ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. గతేడాది జైట్లీ ఆరోగ్యం క్షీణించగా, వైద్య పరీక్షల్లో ఆయనకు అరుదైన కేన్సర్ వ్యాధి ఉన్నట్లు తేలింది. దీంతో ఆయన అమెరికాలో చికిత్స తీసుకున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు.

ఈ నెల 9న ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన జైట్లీ.. నిన్న మధ్యాహ్నం 12.07 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. కాగా, ఈరోజు చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు గల్లా జయదేవ్‌, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌, కంభంపాటి రామ్మోహన్‌రావు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ జైట్లీకి నివాళి అర్పించారు. మరోవైపు జైట్లీ పార్థివదేహాన్ని ప్రస్తుతం ఆయన ఇంటి నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయానికి ఊరేగింపుగా తీసుకెళుతున్నారు.

Related posts