వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై దాడికేసులో ఎన్ఐఏ ఇచ్చిన రిపోర్టుపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఇచ్చిన రిపోర్టుపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ రిపోర్ట్ కోడిగుడ్డుపై ఈకలు తీసిన చందాన ఉందన్నారు. ‘అసలు కోడికత్తి కేసులో కేంద్రానికి ఏం సంబంధముందని ప్రశ్నించారు.
గుజరాత్ సీఎంగా ఎన్ఐఏని మోడీ వ్యతిరేకించారని, టెర్రరిస్ట్ దాడుల లాంటి వాటిలోనే ఎన్ఐఏ చార్జ్ తీసుకుంటుందని చెబితేనే ఒప్పుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు కోడికత్తి కేసు ఏ ప్రాతిపదికన తీసుకున్నారని ? దానిలో ఏం దొరికిందని ప్రశ్నించారు?. రాష్ట్ర సిట్ చెప్పిన మాటే ఎన్ఐఏ చెప్పిందని. చివరికి సీబీఐని కూడా భ్రష్టు పట్టించరంటూ చంద్రబాబు మండిపడ్డారు.