telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అద్వానీ వ్యాఖ్యలు మోడీ గురించే: చంద్రబాబు

Chandrababu comments Jagan cases

బీజేపీ సీనియర్ నేత ఎల్‌కె. అద్వానీ తన బ్లాగ్‌లో రాసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. అద్వానీ వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించినవేనని ఆయన అన్నారు. ఏపీకి నమ్మకద్రోహం చేయడమే కాక కుట్రలతో మనపై దాడులు చేస్తున్న మోదీ తన స్వార్థం కోసం తన పార్టీతో పాటు దేశాన్ని నాశనం చేసే పరిస్థితి ఏర్పడేలా చేస్తున్నారని  మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలు తెలియని ఒక వ్యక్తి కారణంగా దేశ భవిష్యత్‌ ప్రమాదంలో పడిందన్నది ఎప్పటి నుంచో చెబుతున్నానని అన్నారు. అదే విషయాన్ని అద్వానీ సున్నితంగా చెప్పారని పేర్కొన్నారు.జాతీయవాదం అంటే దేశద్రోహం ముద్రవేయడం కాదని చంద్రబాబు అన్నారు.

Related posts