వైసీపీ అధినేత జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి మండిపడ్డారు. మంగళవారం పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసీపీపై ఎక్కడ చూసినా తీవ్ర వ్యతిరేకత ఉందని నేతలకు సూచించారు. జమ్మలమడుగు, చిత్తూరు, అన్నిచోట్లా టీడీపీపై సానుకూలత ఉందన్నారు. కేసుల కోసం మోదీతో..ఆస్తుల కోసం కేసీఆర్తో జగన్ లాలూచీ పడుతున్నారని సీఎం ధ్వజమెత్తారు. తెలంగాణకూ హోదా ఇవ్వాలన్న కేసీఆర్తో కలిసి రాష్ట్రానికి జగన్ హోదా తెస్తాడా? అని నిలదీశారు.
పోలవరంపై పదేపదే కేసులేసే కేసీఆర్కు జగన్ మద్దతా? అని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ఆపాలనే కేసీఆర్తో జగన్ కుమ్మక్కయ్యారని అన్నారు. ఏపీకి డబ్బులు ఇవ్వడానికి మోదీకి చేతులు రాలేదని విమర్శించారు. కానీ ఏపీనినిందించడానికి మాత్రం మోదీకి పెద్దనోరు ఉందని మండిపడ్డారు. మోదీ అహంభావానికి గుణపాఠం చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.