telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రశ్నించే గొంతు నొక్కడం ప్రజాస్వామ్యమా..హౌజ్ అరెస్ట్ పై చంద్రబాబు ఫైర్

chandrababu

నేడు చలో ఆత్మకూరుకు టీడీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ముందస్తు చర్యల్లో భాంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆత్మకూరుకు వెళ్లకుండా టీడీపీ అధినేత చంద్రబాబు ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారుఆయనతో పాటు ఆయన తనయుడు లోకేష్‌ను కూడ పోలీసులు అడ్డుకొన్నారు. కార్యకర్తలతో కలిసి ఇంటి నుండి ర్యాలీగా పార్టీ కార్యాలయానికి వెళ్లున్న లోకేష్ ను పోలీసులు అడ్డుకొని హౌజ్ అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ నేతలతో బుధవారం టెలికాన్పరెన్స్ నిర్వహించారు. ప్రశ్నించే గొంతును నొక్కడం ప్రజాస్వామ్యమా అని ఆయన నిలదీశారు. పునరావాస శిబిరానికి ఆహారం, నీటి సరఫరాను అడ్డుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. పోలీసులు టీడీపీ నేతలను అడ్డుకోవడంపై మండిపడ్డారు.ఎక్కడికక్కడ పార్టీ నేతలను అరెస్ట్‌లు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. న్యాయం చేయాలని కోరితే తమపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి రోజు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Related posts