కక్ష పూరితంగానే టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంటిపై పోలీసులతో సోదాలు చేయిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోట్లదుర్తిలోని సీఎం రమేష్ ఇంటిలోకి 50 మంది పోలీసులు ప్రవేశించి తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారు బెడ్రూమ్లోకి సైతం ప్రవేశించారు. దీంతో సీఎం రమేష్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎస్పీ ఆదేశార ప్రకారమే తాము సోదాలు నిర్వహిస్తున్నామని పోలీసులు ఆయనకు సమాధానం చెప్పారు. కక్ష సాధింపులో భాగంగానే పోలీసులు దాడులు చేస్తున్నారని సీఎం రమేష్ ఆరోపిస్తున్నారు.
previous post