టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా, పల్నాడు దుస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాష్టీకాలు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తు హోంమంత్రి నియోజకవర్గంలోనే దారుణం జరిగిందని, రోడ్డుకు అడ్డంగా వైసీపీ శ్రేణులు గోడ కట్టినా తీసేయలేదని ఆరోపించారు.
రాష్ట్రంలో పోలీసుల తీరు ఒంటెత్తు పోకడగా ఉందని ఆయన మండిపడ్డారు. ఈనెల 29న బాధిత గ్రామాల కార్యకర్తలతో సమావేశం అవుతానని చంద్రబాబు వెల్లడించారు.