telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో ఓటేసేందుకు రాకుండా కేసీఆర్‌ అడ్డుకున్నారు: చంద్రబాబు

Chandrababu comments Jagan cases

టీడీపీకి నష్టం చేయాలని తెలంగాణ సీఎ కేసీఆర్‌ అనేక ప్రయత్నాలు చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో ఓటేసేందుకు రాకుండా కేసీఆర్‌ అడ్డుకున్నారన్నారు. .జగన్‌ కుట్రలకు మోదీ, కేసీఆర్‌ కుతంత్రాలు తోడయ్యాయని ధ్వజమెత్తారు.

ఎన్నికల్లో ఎంతోమంది విలన్లను తట్టుకుని నిలబడ్డామని అన్నారు. సుల మాఫీ, పదవి కోసమే వైపీపీ పోరాటం చేస్తుందని చంద్రబాబు మండిపడ్డారు.టీడీపీలాంటి పార్టీ దేశంలో ఎక్కడా లేదని అన్నారు. ప్రత్యర్థుల అడ్డంకుల్ని పోటాపోటీగా ఎదుర్కొన్నామని, టీడీపీకి, రాష్ట్రానికి నష్టం చేయాలని ప్రధాని మోదీ చేయని ప్రయత్నం లేదని దుయ్యబట్టారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలు టీడీపీ వెంటే ఉన్నారని మరోసారి స్పష్టం చేశారు.

Related posts