telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్, జగన్‌‌లు మోదీ పెంపుడు కుక్కలు: చంద్రబాబు

CM Chandrababu fire to CEC

కేసీఆర్, జగన్‌‌లు నరేంద్ర మోదీ పెంపుడు కుక్కలని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. ప్రధాని మోదీ ఒక బిస్కెట్ ఇస్తే వీళ్లద్దరూ తోక ఊపుకుంటూ ఆయన చుట్టూ తిరుగుతారని ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా గురజాలలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మోదీ గెలిస్తే భవిష్యత్తులో దేశంలో ఎన్నికలు ఉండవని.. ఆయన ఎవరు చెబితే వారే పాలకులు అవుతారని చంద్రబాబు ఆరోపించారు.

హోదాకు మద్ధతిస్తానన్న కేసీఆర్ మాటలను నమ్మడానికి వీలు లేదన్నారు. మాటలు మార్చడంలో కేసీఆర్ సిద్ధహస్తుడని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామన్న కేసీఆర్ ఆ తర్వాత మాట మార్చారని గుర్తు చేశారు. సోనియా గాంధీని రాక్షసి అన్నారని దుయ్యబట్టారు. ఉదయం 7 గంటల కల్లా పోలింగ్ స్టేషన్లకు రావాలని లేదంటే ఓట్ల దొంగలు , మిషన్ దొంగలు కాచుకుని ఉన్నారని మీ ఓట్లు గల్లంతైపోతాయన్నారు చంద్రబాబు సూచించారు. కార్యకర్తలపైనా, అధికారులపైనా అసంతృప్తిగా ఉంటే తనను చూసి ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Related posts