telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కడుపు నిండా ద్వేషం నింపుకున్న వ్యక్తి కేసీఆర్‌: చంద్రబాబు

Chandrababu comments Jagan cases

తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి మండిపడ్డారు. మంగళవారం ఎలక్షన్ మిషన్ 2019పై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కడుపు నిండా ద్వేషం నింపుకున్న వ్యక్తి కేసీఆర్‌ అని విమర్శించారు. తెలంగాణలో 25 లక్షల ఓట్ల తొలగింపునకు కేసీఆర్‌ తెగించారని దుయ్యబట్టారు. టీడీపీ సేవామిత్ర యాప్‌పై కేసీఆర్‌ దాడి జగన్ కోసమే అని ఆరోపించారు.డేటా సమాచారం దొంగిలించి వైసీపీకి ఇవ్వడం నేరమన్నారు.

ఏపీ హోదా, ఉపాధి, నీళ్లపై టీఆర్‌ఎస్‌ దాడి. ఏపీకి హోదాను తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్‌ వ్యతిరేకించారు. జగన్ మేలు కోసమే కేసీఆర్‌ హోదా డ్రామా ఆడారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అవినీతి సొమ్మును వైసీపీ వెదజల్లుతోందని మండిపడ్డారు. సర్వేలు అన్ని టీడీపీకే అనుకూలమని చెప్పాయని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా ఏకపక్షంగా టీడీపీకే మద్దతు ఇస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే టీడీపీకి శ్రీరామ రక్ష అని చంద్రబాబు అన్నారు.

Related posts