telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆశా వర్కర్ల పనికి గ్రేడ్ లు ఏంటి.. సర్కార్ పై చంద్రబాబు ఫైర్

chandrababu gift on may day

రాష్ట్రంలోని ఆశా వర్కర్లకు గ్రేడ్ లు కేటాయించడం పై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఆశా వర్కర్లకు ఏపీ సర్కారు అన్యాయం చేస్తోందంటూ మండిపడ్డారు. రాష్ట్రంలోని ఆశా వర్కర్లకు రూ.10 వేలు వేతనం ఇస్తామంటూ ఫొటోలకు పోజులిచ్చి, ఇప్పుడు వారిని ఉద్యోగంలోంచి తీసేసే జీవో జారీ చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆశా వర్కర్ల పనితీరుకు గ్రేడ్ లు ఏంటి? అని ప్రశ్నించారు. చిరు ఉద్యోగులపై ఇలాంటి థర్డ్ గ్రేడ్ కుట్రలు చేస్తున్నారంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఇలాంటి దుర్మార్గపు జీవోలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూ. 10 వేలు వేతనం ఇస్తామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని స్పష్టం చేశారు. “ఒకవేళ మీకు ఆ ఉద్దేశం లేకపోతే ఆయుధం సిద్ధంగానే ఉంది కదా, ఆలస్యం ఎందుకు మీ పేటీఎం బ్యాచ్ కి ఒక్క ఫోన్ కొట్టండి. ఆందోళన చేస్తున్న ఆశా కార్యకర్తలను కూడా పెయిడ్ ఆర్టిస్టులంటూ ఏదో ఒక కథ అల్లేస్తారని ట్విటర్ లో విమర్శనాస్త్రాలు సంధించారు.

Related posts