ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి గురువారం రాత్రి అమరావతికి చేరుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్ లో ఈరోజు శ్రీకాకుళం టీడీపీ లోక్సభ అభ్యర్థులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే శ్రీకాకుళం సిట్టింగ్ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి కుటుంబసభ్యుడొకరు మృతి చెందారు. దీంతో ఈ సమీక్షకు ఆమె వెళ్లలేకపోయారు.
ఎమ్మెల్యే లక్ష్మీదేవి రాలేదని చెప్పి, మిగిలిన నేతలు కూడా గైర్హాజరయ్యారు. సమీక్ష అని తెలిసి కూడా ఎందుకు రాలేదంటూ మండిపడ్డట్లు సమాచారం. ఈ సమీక్షకు పలాస, ఇచ్చాపురం, టెక్కలి, పాతపట్నం, ఆముదాలవలస, నరసన్నపేటకు చెందిన నేతలు హాజరయ్యారు. సమీక్ష సమావేశానికి డుమ్మా కొట్టిన నేతల పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.