telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎన్నికల ముందు అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లు: చంద్రబాబు

అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే. అయితే ఎన్నికల వేళ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఎన్నికలు వస్తున్నందునే అగ్రవర్ణాల రిజర్వేషన్లను కేంద్రం తెరపైకి తెచ్చిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లాలోని కోస్గిలో నిర్వహించిన జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో సీఎం చంద్రబాబుపాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీల్లో, కాపులను బీసీల్లో చేర్చాలని ఆమోదించి కేంద్రానికి పంపామని, అది ఏమైందని సీఎం ప్రశ్నించారు.రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇంకా రూ.85వేల కోట్లు ఇవ్వాలని నిపుణుల కమిటీ చెప్పిందన్నారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందన్నారు. ప్రజలు జరుగుతున్న పరిణామాలన్నింటినీ గమనిస్తున్నారన్నారని పేర్కొన్నారు.

Related posts