టీడీపీ అధినేత చంద్రబాబు నేటి నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేపడుతున్న ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పాల్గొంటారు.
మొదటగా ఆమదాలవలస నియోజకవర్గంలోని పొందూరు మండలంలో గల దల్లవలస గ్రామంలో నుంచే చంద్రబాబు టూర్ ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలను ప్రజలకి వివరించనున్నారు. పన్నులు, ఛార్జీలు పెంచేసి ప్రజల నడ్డివిరుస్తున్నారని బాదుడే బాదుడు పేరుతో టిడిపి నిరసనలను చేపడుతుంది.
ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు చంద్రబాబు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి విమానంలో విశాఖకు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు దళ్లవలస గ్రామం చేరుకుంటారు. 9.30 గంటలకు విశాఖ టీడీపీ కార్యాలయానికి చేరుకుని, రాత్రి అక్కడే బసచేస్తారు.
రాజధానిగా అమరావతినే కొనసాగించాలి: పత్తిపాటి పుల్లారావు డిమాండ్