telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సంప్రదాయాన్ని మార్చడం అనాచారం: చంద్రబాబు

chandrababu tdp ap

అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని మార్చడం అనాచారమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరంలేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటనపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. సనాతనం అంటే ఏనాటికీ మారని శాశ్వత ధర్మం అని తెలిపారు.

పాలకులు మారినప్పుడల్లా ధర్మాలు, సంప్రదాయాలు మారవని చంద్రబాబు స్పష్టం చేశారు. అలా మార్చాలనుకోవడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని విమర్శించారు.అసలు మతం అంటేనే నమ్మకం అని, ఎవరైనా సరే స్వామిపై నమ్మకంతో రావడం కోసమే తిరుమల లో అన్యమతస్తులు డిక్లరేషన్లు ఇచ్చే సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారని వివరించారు.

Related posts