telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దళిత మహిళ ఇల్లుకు నిప్పు..చంద్రబాబు విచారం

chandrababu tdp ap

ప్రజలను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా ముదినేపల్లిలో మచ్చా ధనలక్ష్మి అనే దళిత మహిళ ఇంటిని వైసీపీ వర్గీయులు తగలబెట్టేశారని ఆయన తెలిపారు.ఈ ఘటన పై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఇది భయానకమైన ఘటన అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

ధనలక్ష్మి కుటుంబ సభ్యులు కొద్దిలో ప్రాణాలు కాపాడుకున్నారని పేర్కొన్నారు. అయితే దురదృష్టవశాత్తు వారి వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయని విచారం వ్యక్తం చేశారు. గత 15 నెలలుగా ఏపీలో దళితులపై దాడులు ఉద్ధృతంగా జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. ప్రజలను రక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.

Related posts