telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జేఈఈ ర్యాంకర్లకు చంద్రబాబు అభినందనలు

Chandrababu comments Jagan cases

2019 విద్యాసంవత్సరంలో ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పరీక్ష ఫలితాలు సోమవారం రాత్రి ప్రకటించారు. ఈ ఫలితాల్లో మరోసారి తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. టాప్‌-10లో ఏకంగా నాలుగు ర్యాంకులు సాధించిన సంగతి తెలిసిందే. జేఈఈ ర్యాంకర్లకు ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.

జేఈఈ మెయిన్ ఫలితాలలో తెలుగు రాష్ట్రాల విద్యార్ధులు ముందంజలో ఉన్నారు..వీరిలో తెలంగాణ నుంచి నలుగురు ఉండగా, ఏపీ నుంచి ఇద్దరున్నారు. విద్యార్ధుల ప్రతిభతో ఏపీ ఖ్యాతి దేశవ్యాప్తంగా ఇనుమడించడం సంతోషంగా ఉందని బాబు తెలిపారు. తొలి 10ర్యాంకులలో 3 ర్యాంకులు, మొదట 24మందిలో 6 గురు తెలుగు విద్యార్థులే ఏటా జేఈఈ మెయిన్‌లో 30% నుంచి 40% ర్యాంకులు తెలుగువారే ఉండటం అభినందనీయమని చంద్రబాబు పేర్కొన్నారు.

Related posts