telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆర్థిక సంస్కరణల కోసం అరుణ్ జైట్లీ కృషి: చంద్రబాబు

chandrababu

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఈరోజు అన్నారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జైట్లీ మరణంపై టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వాజ్ పేయి, నరేంద్రమోదీ మంత్రివర్గాల్లోఆర్థిక సంస్కరణల కోసం జైట్లీ కృషి చేశారు.

విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన జైట్లీ, పార్లమెంటు సభ్యుడిగా, కేంద్రమంత్రిగా అంచెలంచెలుగా ఎదిగారన్నారు. కేంద్రమంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా జైట్లీ అందించిన సేవలు చిరస్మరణీయమని చంద్రబాబు తెలిపారు. ఆయన కోలుకుంటారని ఆశిస్తున్న తరుణంలో అందరికీ దూరం కావడం నిజంగా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఆయన మృతి బీజేపీకే కాకుండా మొత్తం దేశానికే తీరనిలోటని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Related posts