telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కోడెల మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నా: చంద్రబాబు

chandrababu gift on may day

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలం తనతో రాజకీయ ప్రస్థానం కొనసాగించిన కోడెల శివప్రసాద్ మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నానని చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

డాక్టర్ వృత్తి నుంచి టీడీపీలో చేరి అత్యంత ప్రజాదరణ పొందారని, ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి, ప్రజలకు తీరని లోటు అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కోడెల కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.

Related posts