ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టు రీటెండరింగ్ పై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ మూర్ఖంగా నిర్ణయాలను తీసుకుంటున్నారని విమర్శించారు. పోలవరం రీటెండరింగ్ వల్ల ప్రాజెక్టుకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతున్నా వైసీపీ ప్రభుత్వానికి అర్థం కాలేదని ఎద్దేవా చేశారు.
పోలవరంలో లేని అనినీతిని నిరూపించాలనే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. టెండర్లను రద్దు చేసే ఆలోచనను విరమించుకోవాలని కేంద్ర మంత్రి గడ్కరీ కూడా ఎన్నో సార్లు చెప్పారని చంద్రబాబు అన్నారు. ఒకసారి న్యాయ వివాదం మొదలైతే ప్రాజెక్టు నిర్మాణం జాప్యం జరుగుతుందని చెప్పారు. పోలవరంతో ప్రయోగాలు వద్దని తాము ముందు నుంచి చెబుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
జూనియర్ ఎన్టీఆర్కు మాకు సంబంధం ఏంటి?