telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

కోల్‌కతా వచ్చిన వాళ్లంతా మోడీ వ్యతిరేకులే: చంద్రబాబు

Chandrababu fire sakshi media
బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  కోల్‌కతాలో చేపట్టిన యునైటెడ్ ఇండియా ర్యాలీకి 20 పార్టీల నాయకులు హాజరయ్యారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. కోల్‌కతా వచ్చిన వాళ్లంతా మోడీ వ్యతిరేకులేనని చంద్రబాబు అన్నారు.  జగన్, కేసీఆర్ మాత్రం ర్యాలీకి రాలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కేసీఆర్, జగన్ ఉన్నది మోడీ వెంటనే అనేది ఈ ఘటనతో మరోసారి స్పష్టమైందన్నారు.  
ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇచ్చామని బీజేపీ అనడం హాస్యాస్పదమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కర్ణాటకలో బీజేపీ దుర్మార్గ రాజకీయాలు చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. దేశంలోని ఆలయాల్లో అశాంతిని సృష్టిస్తోందని విమర్శించారు. శబరిమలలో ఉద్రిక్తలు రెచ్చగొడుతోందని ఆరోపించారు. ఆలయాల్లో సృష్టించే అల్లర్ల  పట్ల దేశప్రజలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Related posts