telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఓట్ల తొలగింపు కుట్రలను భగ్నం చేశాం: చంద్రబాబు

Chandrababu comments Jagan cases

సకాలంలో స్పందించి ఓట్ల తొలగింపు కుట్రలను భగ్నం చేశామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం ఉదయం అమరావతిలో ఆయన టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ అరాచకాలను, బీజేపీ తప్పుడు పనులను ఎండగట్టామని అన్నారు. పోలింగ్ రోజు ఉదయాన్నే ఈవీఎంలు మొరాయించేలా చేశారని చంద్రబాబు ఆరోపించారు.

తెలుగుదేశం పార్టీ గెలుపును అడ్డుకోవడానికి జరిగిన కుట్రలను ప్రజలే అడ్డుకున్నారన్నారు. తాడిపత్రిలో టీడీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి హత్య, స్పీకర్‌పై దాడి, మహిళా అభ్యర్థులపై దౌర్జన్యాలు చేశారని మండిపడ్డారు. తప్పులు చేసి ప్రజా తీర్పును కాలరాయాలని చూశారని ఓటింగ్ శాతాన్ని దెబ్బ తీయాలని కుట్రలు చేశారని చంద్రబాబు ఆరోపించారు.

Related posts