telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అతి విశ్వాసంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి: చంద్రబాబు

Chandrababu fire sakshi media

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల పై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. అతి విశ్వాసంతోనే ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఎలక్షన్ మిషన్ 2019లో భాగంగా ఆయన బుధవారం అమరావతిలో పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..పోలవరం ఆపాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించటం నీచమైన చర్యగా చంద్రబాబు అభివర్ణించారు.

ఎన్నికలకు సంబంధం లేని ఇంటెలిజెన్స్ అధికారిని బదిలీ చేయడం వెనుక ఆంతర్యం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఏ కారణంతో ఇద్దరు ఎస్పీలను బదిలీ చేశారో సమాధానం చెప్పాలని ఈసీనీ చంద్రబాబు డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో ప్రత్యర్థులు ఇంకా ఎన్నో కుట్రలు చేసే అవకాశం ఉన్నందున దేన్నైనా గట్టిగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలు టీడీపీ వైపు ఉన్నంత వరకు ఎవరెన్ని కుట్రలు చేసినా సాగవని స్పష్టం చేశారు.

Related posts