telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ ఇంటర్ విద్యార్థుల మరణం తనను కలచివేసింది: చంద్రబాబు

Chandrababu comments Jagan cases

తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. విద్యార్థుల మరణం తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరీక్షల కంటే ప్రాణాలు ఎంతో విలువైనవని అన్నారు. పరీక్షల్లో పాస్ కానంత మాత్రాన ప్రాణాలు తీసుకుని తల్లిదండ్రులను కడుపుకోతకు గురిచేయవద్దన్నారు.
పరీక్షల్లో గెలవడమే జీవితం కాదని వివరించారు. పరీక్షలు ప్రతిభకు గుర్తింపు మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ ప్రపంచంలో విజేతలుగా నిలిచిన వారందరూ తొలుత పరాజితులేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. చదువు విజ్ఞానం పెంచుకోవడానికేనని, చదువే జీవితం కాదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. విజయానికి ఓటమి తొలిమెట్టు అని, మళ్లీ కష్టపడితే మంచి ఫలితం వస్తుందని సూచించారు. ఎంచుకున్న రంగాల్లో ప్రతిభ చూపితే బంగారు భవిష్యత్తు మీ సొంతమవుతుందన్నారు. మీ ఎదుగుదలే తల్లిదండ్రులకు మీరిచ్చే గొప్ప బహుమతి అని పేర్కొన్నారు.

Related posts