పులివెందులలో జగన్ చెదపుట్టాడని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. బుధవారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన టీడీపీ ఎన్నికల సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులివెందుల ప్రజలు చాలా మంచోళ్లని ఆయన చెప్పారు. పులివెందులలలో తాను నిర్వహించిన సభకు అనూహ్య స్పందన వచ్చిందని చెప్పారు.
చావడమో, చంపడమో ఉంటుందని ఓ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి అనిల్ కుమార్ చేసిన ప్రకటనపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఉరికో రౌడీ పుట్టుకొస్తారని దుయ్యబట్టారు. హత్యలు, శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే చూస్తూ ఊరుకోనని చంద్రబాబు హెచ్చరించారు. హత్యలు చేస్తామంటే శాశ్వతంగా జైల్లోనే ఉంటారని బాబు హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొంటామని చెబితే చూస్తూ ఊరుకోనని బాబు తేల్చిచెప్పారు.