telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

మోదీ ఆదేశాలమేరకే  కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్: చంద్రబాబు

ప్రధాని మోదీ ఆదేశాలమేరకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ డ్రామా నడిపిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఏపీపై కుట్రలు చేసేందుకే జగన్‌తో కేటీఆర్ హడావుడిగా భేటీ అయ్యారని అన్నారు. ఎలక్షన్ మిషన్ 2019పై చంద్రబాబు గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గుజరాత్ కన్నా ఏపీ అభివృద్దిలో మించిపోతుందని మోదీకి భయం పట్టుకుందని అన్నారు.  తెలంగాణలో 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించారని, అలాంటి టీఆర్ఎస్‌తో జగన్ అంటకాగుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.
ఏపీలో బీసీలు జగన్‌కు తగిన విధంగా బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. అసూయపరులంతా ఒక్కటయ్యారని, కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌కు స్పందన లేదని అన్నారు. ఎవరిపైనైనా దుష్ప్రచారం చేయడం వైసీపీకి మొదటినుంచీ అలవాటని ఆయన ఆరోపించారు. గతంలోనూ అధికారులపై, న్యాయమూర్తులపై దుష్ప్రచారం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు.

Related posts