ప్రతి నియోజకవర్గంలో కనీసం 50శాతం వీవీప్యాట్లను లెక్కించాలని 22 ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడిగా విజ్ఞప్తి చేసినా ఎన్నికల సంఘం ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేతలు, అమిత్ షా ఫిర్యాదులపై ఎన్నికల సంఘం తక్షణమే స్పందించడం, టీఎంసీ నేతల ఫిర్యాదులను విస్మరించడం ఆందోళన కలిగిస్తోందని ట్విట్టర్లో పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్రమోదీకి పదే పదే క్లీన్చిట్లు ఇవ్వడం, బీజేపీ చేసిన తప్పుడు ఫిర్యాదులపై కూడా వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం ఆందోళనకు గురి చేస్తుందన్నారు. ప్రతిపక్షాల ఫిర్యాదుల్లో వాస్తవం ఉన్నప్పటికీ కావాలనే చర్యలు చేపాట్టడం లేదని ఆరోపించారు. ప్రతిపక్షం చేసిన ఫిర్యాదులపై కూడా స్పందించి ఎన్నికల సంఘం విశ్వసనీయతను నిరూపించుకోవాలని చంద్రబాబు ట్విట్టర్లో పేర్కొన్నారు.