telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సీఎం జగన్‌ అసత్యాలతో తమకు సవాల్‌ విసురుతున్నారు: చంద్రబాబు

chandrababu gift on may day

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అధికార, విపక్షాల విమర్శల మధ్య వాడివేడిగా సాగింది. ఈ సమావేశాల్లో అధికారపక్షం అనుసరిస్తున్న తీరుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. సమావేశాల్లో అధికారపక్షం తీరు సరిగా లేదని ఆరోపించారు. సీఎం జగన్‌ అసత్యాలతో తమకు సవాల్‌ విసురుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విపక్షాన్ని అవహేళన చేసేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు.

గాడిదలు కాశారా అంటూ అవమానిస్తారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ మంత్రి దొబ్బేశారు అనే పదం వాడారని విమర్శించారు. 2014-15లో సున్నా వడ్డీ పథకానికి రూ.230 కోట్లు కేటాయించామని, 2016-17లో రూ.175 కోట్లు, 2017-18 రూ.175 కోట్లు, 2018-19లో రూ.175 కోట్లు కేటాయించామని తెలిపారు. రైతులకు సున్నా వడ్డీ పథకం కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు.

Related posts