telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ముగిసిన చంద్రబాబు విదేశీ పర్యటన.. లండన్ నుంచి నేడు హైదరాబాదుకు

chandrababu fire on AP CS again

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన కుటుంబంతో విదేశీ పర్యటనకు వెళ్ళిన విషయం తెలిసిందే. గడచిన వారం రోజులుగా లండన్ లో తన కుటుంబంతో విహారంలో ఉన్న చంద్రబాబు నేడు హైదరాబాద్ కు రానున్నారు. తన పర్యటనను ముగించుకున్న ఆయన గత రాత్రి విమానంలో బయలుదేరారు. నేడు హైదరాబాదుకు చేరుకొని, రేపు అమరావతికి వెళ్లనున్నారు.

ఆపై తనకు అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారని తెలుస్తోంది. కాగా, చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లగానే, రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ లతో పాటు నలుగురు పార్టీ ఫిరాయించారు. వీరితో పాటు మరింత మంది ప్రజా ప్రతినిధులు టీడీపీని వీడుతారని వార్తలు వెలువడుతున్నాయి.

Related posts