telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దర్శి బరిలో శిద్దా సుధీర్.. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్?

Chandrababu comments Jagan cases

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రకాశం జిల్లా రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. ఈ జిల్లాలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు పెద్ద సమస్యగా మారింది. దర్శి, కనిగిరి నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై  చంద్రబాబు ఎంతో కసరత్తు చేశారు. దర్శి నుంచి పోటీ చెయ్యాలని బాలకృష్ణ మిత్రుడు కదిరి బాబూరావును తొలుత ఆదేశించిన చంద్రబాబు తాజాగా ఆయనకు ఝలక్ ఇచ్చారని తెలుస్తోంది.

కదిరి బాబూరావుకు కాకుండా మంత్రి శిద్దా రాఘవరావు కుమారుడు శిద్ధా సుధీర్ కు టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.కనిగిరి టికెట్ మాత్రం ఉగ్రనరసింహారెడ్డికే కేటయిస్తూ చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం అధికారికంగా టికెట్ శిద్ధా సుధీర్ ను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అందువల్లే కదిరి బాబూరావుకు బీఫామ్ ఇవ్వొద్దని టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్థన్ ను ఆదేశించినట్లు తెలుస్తోంది..

Related posts