telugu navyamedia
రాజకీయ వార్తలు

అయోధ్య వివాదానికి ముగింపు పలికిన సుప్రీం: చంద్రబాబు

chandrababu

వివాదాస్పద అయోధ్య కేసులో సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ఎన్నో దశాబ్దాలుగా నలుగుతున్న వివాదాస్పద భూమి హిందువులదేనని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పిందని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

సుదీర్ఘమైన న్యాయ ప్రక్రియ అనంతరం అంతిమ తీర్పు వెలువరించింది. దీనిపై అయోధ్య అంశంపై న్యాయమూర్తుల ప్యానెల్ వెలువరించిన ఏకగ్రీవ నిర్ణయాన్ని తప్పక గౌరవించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ సమయంలో శాంతి, సామరస్యతలను పాటించాలని ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.

Related posts