టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హైదరాబాద్ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి పయనమయ్యారు. ఎయిర్ పోర్టు ముఖద్వారం వద్దే చంద్రబాబు వాహనాన్ని భద్రతా సిబ్బంది నిలిపివేశారు. ఆయనను సాధారణ వ్యక్తిలాగా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.
తన వాహనాన్ని లోపలికి అనుమతించకపోవడంతో ఎయిర్ పోర్టులో ప్రవేశించడానికి చంద్రబాబు ప్రయాణికుల బస్సులో వెళ్లాల్సి వచ్చింది. ఆయన ఓ వీఐపీ అయినా, జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నా విమానాశ్రయ అధికారులు ప్రత్యేక వాహనాన్ని కేటాయించలేదు. చంద్రబాబు ఇవేవీ పట్టించుకోకుండా ఎంతో హుందాగా వ్యవహరించి గమ్యాన్ని చేరుకున్నారు.
సమస్యలపై రాసిన లేఖలకు జగన్ నుంచి స్పందన లేదు : కన్నా