telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

పర్యటనలతో తూరుపారపోస్తున్న బాబు.. రేపు తిరుపతిలో..

chandrababu ap tour before results

ఎపి సిఎం చంద్రబాబు ఒంటిమిట్టలో రాములవారి కల్యాణోత్సవంలో పాల్గొన్న అనంతరం.. అనేక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నేడు(శుక్రవారం) కర్నూలు జిల్లా రాతివనాల ప్రాంతాన్ని దర్శించారు. రేపు (శనివారం) సాయంత్రం 4.45 గంటలకు చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుపతి కి బయలుదేరనున్నట్లు సమాచారం.

తిరుపతి పర్యటనలో.. చంద్రబాబు కోట కొమ్మల వీధిలో బ్లడ్‌ బ్యాంక్‌ ను ప్రారంభించనున్నారు. ఈ బ్లడ్‌ బ్యాంక్‌ ను ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేసింది. చంద్రబాబుతో పాటు నారా లోకేశ్‌, భువనేశ్వరి, బ్రాహ్మణి, నారా రోహిత్‌ తదితర కుటుంబ సభ్యులు కూడా బ్లడ్‌ బ్యాంక్‌ ప్రారంభోత్సవంలో పాల్గొంటారని తెలుస్తోంది. గెలుపు అవకాశాలను కూడా ఆయా ప్రాంతాలలో పర్యటనలో భాగంగా బాబు తెలుసుకుంటున్నట్టు తెలుస్తుంది.

Related posts