telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాళ్లు, చెప్పులు విసరడం ఎంత వరకు సమంజసం: పురందేశ్వరి

daggubatipurandeswari

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అమరావతి పర్యటనలో నిన్న ఆయన కాన్వాయ్ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు, రాళ్లు విసిరిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పై బీజేపీ నేత పురందేశ్వరి ఘాటుగా స్పందించారు. నిరసన తెలపొచ్చు కానీ..రాళ్లు, చెప్పులు విసరడం ఎంత వరకు సమంజసమని ఆమె మండిపడ్డారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎలాంటి మార్పు లేదని అన్నారు. వైసీపీ పాలనతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని పురందేశ్వరి ఆరోపించారు. ఇప్పటికీ రాష్ట్రంలో ఇసుక కష్టాలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయని చెప్పారు. రాజధానిని శ్మశానంతో పోల్చడం సరికాదన్నారు. రాజధానిపై నాన్చివేత ధోరణి, పోలవరంలో రివర్స్‌ టెండర్లు సరికాదని పురందేశ్వరి అభిప్రాయపడ్డారు.

Related posts