ఏపీ కొత్త గవర్నర్ హరిచందన్తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. సుమారు 15 నిమిషాలపాటు ఏకాంతంగా ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు పలు కీలక విషయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్తో తనకున్న అనుబంధాన్ని గవర్నర్ గుర్తు చేసుకున్నారు.
తొలిసారి ఎన్టీఆర్ను భవనేశ్వర్ ఎయిర్పోర్టులో కలిశానని గవర్నర్.. చంద్రబాబుకు చెప్పారు. అంతేకాదు ఎన్టీఆర్ మహా నాయకుడని.. గవర్నర్ హరిచందన్ చెప్పుకొచ్చారు. కాగా.. గతంలో విజయవాడలో పర్యటించిన సందర్భాలను గవర్నర్ గుర్తుచేసుకున్నారు. బిజూపట్నాయక్తో తన అనుబంధాన్ని చంద్రబాబు గవర్నర్తో పంచుకున్నారు. ఈ సందర్భంగా తమ రాజకీయ అనుభవాన్ని హరిచందన్- చంద్రబాబు పరస్పరం పంచుకున్నారు.