telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కౌంటింగ్ పై అభ్యర్థులకు చంద్రబాబు దిశానిర్దేశం!

Chandrababu comments Jagan cases

మే 23న సార్వత్రిక ఎనికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అమరావతిలో పార్టీ అభ్యర్థులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా, ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థులు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.

ప్రిసైడింగ్ అధికారులు ఇచ్చే 17-సి ఫారాలు, ఆయా పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లు, మొత్తం ఓట్ల వివరాలు తెలియజేసే ఇ-ఫారాలపై అభ్యర్థులకు ముందుగానే అవగాహన కలిగించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి టీడీపీ అగ్రనేతలు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ హాజరవ్వాలని పార్టీ అడిష్టానం ఆదేశాలు జారీ చేసింది.

Related posts