మే 23న సార్వత్రిక ఎనికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అమరావతిలో పార్టీ అభ్యర్థులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా, ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థులు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.
ప్రిసైడింగ్ అధికారులు ఇచ్చే 17-సి ఫారాలు, ఆయా పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లు, మొత్తం ఓట్ల వివరాలు తెలియజేసే ఇ-ఫారాలపై అభ్యర్థులకు ముందుగానే అవగాహన కలిగించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి టీడీపీ అగ్రనేతలు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ హాజరవ్వాలని పార్టీ అడిష్టానం ఆదేశాలు జారీ చేసింది.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కొట్టిపారేసిన స్టాలిన్