ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారిగా హైదరాబాద్ కు వచ్చిన ఆయన వైద్య పరీక్షల నిమిత్తం ఏషియన్ గాస్ట్రోలజి ఆసుపత్రికి వెళ్లారు. ఈ ఉదయం బాబు ఆసుపత్రికి చేరుకోగా, దాదాపు గంటకు పైగా వైద్య పరీక్షలు జరిగాయని సమాచారం.
వైద్య పరీక్షల అనంతరం జూబ్లీహిల్స్లోని తన ఇంటికి ఆయన చేరుకున్నారు. పలువురు సీనియర్ నాయకులు జేసీ దివాకర్ రెడ్డి, ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ఆయనతో భేటీ అయ్యారు. వీరి మధ్య తెలుగు రాష్ట్రాల రాజకీయాల పరిణామాలపై చర్చ జరిగినట్టు సమాచారం.
టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత వ్యవహారాలు: బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్రావు