telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఐటీ దాడులను నిరసిస్తూ చంద్రబాబు నిరసన

CM Chandrababu fire to CEC

కేంద్రంలోని మోడీ సర్కార్ కక్షతో వ్యహరిస్తూ టీడీపీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకొని ఐటీ దాడులు చేయిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. కేంద్రం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఎన్నికల్లో టీడీపీని దెబ్బతీసేందుకు గాను ఐటీ దాడులు నిర్వహిస్తున్నారని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఇందులో భాగంగా చంద్రబాబు విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రదాని మోదీ రాష్ట్ర అభివృద్దికి నిధులు ఇవ్వకుండా ఎదురుదాదులు చేస్తున్నారని ఆరోపించారు.

టీడీపీ అభ్యర్థులు పుట్టా సుధాకర్ యాదవ్, పి. నారాయణ, ఉగ్ర నరసింహారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించారు.తాజాగా టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో కూడ శుక్రవారం నాడు ఐటీ సోదాలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీడీపీని దెబ్బతీసేందుకు గాను ఐటీ దాడులు నిర్వహిస్తున్నారని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ దాడులను నిరసిస్తూ రాష్ట్రంలోని పలు అంబేద్కర్ విగ్రహల వద్ద టీడీపీ నేతలు నిరసనలకు దిగారు.

Related posts