ప్రధాని నరేంద్ర మోదీ అడుగుతున్నట్టుగా లెక్కలు చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఏపీ సీఎం నారా చంద్రబాబు అన్నారు. అదే తరహాలో మోదీ కూడా లెక్కలు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలో ధర్మపోరాట దీక్షలోఆయన ప్రసంగిస్తూ ప్రస్తుతం ప్రధాని పదవిలో ఉన్న మోదీకి పరిపాలించే అర్హత లేదని విమర్శించారు.
చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న రాష్ట్రంపై కక్ష సాధింపు ధోరణిని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. తెలుగు ప్రజల నాడి తెలియని వ్యక్తి మోదీ అని విమర్శనాస్త్రాలు సంధించారు. తంలో ఏపీ భవన్ సాక్షిగా చేసిన ఎన్నో ఉద్యమాలు విజయవంతం అయ్యాయని గుర్తు చేశారు. ఇప్పుడు న్యాయమైన డిమాండ్లతో చేస్తున్న ఈ దీక్ష కూడా విజయవంతం అవుతుందని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం తీవ్ర ఆగ్రహంతో ఉందన్నారు. మాకు అధికారం ఉందని ఇష్టానుసారంగా పాలన చేస్తామంటే బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
పరిపాలించే వ్యక్తులు బాధ్యతగా ఉండాలని వ్యాఖ్యానించారు. భావి తరాల కోసం పోరాటం చేస్తున్నామని చెప్పారు. జీవితంలో ఆస్తులు పోగొట్టుకుంటే మళ్లీ సంపాదించుకోవచ్చుగానీ, ఆత్మగౌరవాన్ని పొగొట్టుకుని బతకలేమని చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు చెప్పిన విషయాన్ని న చంద్రబాబు గుర్తు చేశారు. ప్రశ్నించినందుకు నిందలు వేస్తున్న వ్యక్తులకు గుణపాఠం చెప్పే సమయం తొందర్లోనే ఉందని బాబు పేర్కొన్నారు.