నేడు విజయవాడ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు ఏపీ సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో న్యాయమూర్తి ముందు సీఎం ప్రమాణం చేయనున్నారు. ప్రమాణం చేసిన సర్టిఫికెట్ను చంద్రబాబు కుప్పం పంపనున్నారు. కుప్పంలో నామినేషన్కు వ్యక్తిగతంగా హాజరుకాలేకపోతున్నందున.. వేరే వ్యక్తితో చంద్రబాబు నామినేషన్ పత్రాలను పంపుతున్నారు. చంద్రబాబు ఈనెల 22న కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. విదియ తిథితో కూడిన శుక్రవారం నామినేషన్ వేయడానికి మంచి ముహూర్తమని ఆ తేదీని నిర్ణయించారు.
గత మూడు దఫాలుగా చంద్రబాబు ఎన్నడూ స్వయంగా వచ్చి నామినేషన్ వేయలేదు. ఆయన తరఫున పార్టీలోని స్థానిక ముఖ్యులే ఆ ప్రక్రియను పూర్తి చేస్తూ వచ్చారు. 2014 ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ కుప్పం వచ్చి తండ్రి తరఫున నామినేషన్ దాఖలు చేశారు.ఈ సారి సతీమణి నారా భువనేశ్వరిని చంద్రబాబు తరఫున నామినేషన్ దాఖలు చేయడానికి ఆహ్వానిస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 22న చంద్రబాబు తరపున పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఒకే దేశం ఒకే రాజ్యాంగం.. ముఖర్జీ కల నెరవేరింది: ఎంపీ సంజయ్