శుభకార్యాలకు మూఢమి కారణంగా మూడు నెలల పాటు అంతరాయం కలగనుందని రాష్ట్ర అర్చక పురోహిత విభాగం అధ్యక్షుడు శ్రీరామదుర్గ కుమారాచార్యులు తెలిపారు. గురువారం కామవరపుకోటలోని లలితా పీఠంలో ఆయన మాట్లాడుతూ ఏటా వివాహాది శుభకార్యాలకు శ్రావణ మాసంలో చక్కటి ముహూర్తాలు ఉండేవని, జూలై ఆషాఢ మాసం కావడంతో శూన్యమాసం అయ్యిందని, కారణంగా శుభకార్యాలు జరగబోవని తెలిపారు. ఈ ఏడాది శ్రావణ మాసంలో కూడా మూఢమి వచ్చింది. సెప్టెంబర్ భాద్రపద మాసం కావడంతో శూన్యమాసమయ్యింది. మూడు నెలలు శుభకార్యాలకు ఆటంకం ఏర్పడింది. అక్టోబర్ 2 నుంచి ముహూర్తాలు మొదలవుతాయి. మూఢమి ప్రవేశంతో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలు దాదాపు మూడు నెలలపాటు ఆగుతాయన్నారు.