telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణకు  నావంతు సహకారం అందిస్తా: కిషన్ రెడ్డి

kishan reddy mp

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నావంతు సహకారం అందిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికిషన్ రెడ్డి తెలిపారు.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాలు, పక్షాల పోరాటంతో ఏర్పడిన తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తునని అన్నారు.

ఉద్యమంలో కలిసి పనిచేసిన స్పూర్తిని కొనసాగిస్తూ అభివద్ధిలో కూడా ప్రజలను భాగస్వామ్యం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఆ దిశలో తెలంగాణ ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. నరేంద్రమోదీ ప్రధానిగా రెండోసారి ఎన్నికైన సందర్భంగా చూపించిన సమాఖ్య స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతల ఆధారంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

Related posts