కేంద్ర క్యాబినెట్ లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో 16వ లోక్ సభను రద్దు చేస్తూ తీర్మానించింది. ఢిల్లీలో ఇవాళ కేంద్ర క్యాబినెట్ భేటీ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ప్రధాని పదవికి రాజీనామా చేయాలని మోదీ నిర్ణయించుకున్నారు.
తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లోక్ సభ రద్దు నేపథ్యంలో కేంద్ర మంత్రులకు రాత్రి ఏడున్నరకు రాష్ట్రపతి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎంపీలు పార్లమెంటరీ పార్టీ నేతను ఎన్నుకుంటారు.
ఉద్యోగులకు పాత పద్ధతిలోనే పెన్షన్: పవన్ కల్యాణ్