ఈరోజు భారతీయ చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖులు ప్రధాని మోదీకి ముస్లింలు, దళితులు, ఇతర మైనార్టీలపై జరుగుతున్న మూకదాడుల్ని తక్షణమే అడ్డుకోవాలని బహిరంగ లేఖ రాశారు. ఫిల్మ్ రంగానికి చెందిన 49 మంది ప్రముఖులు ఈ లేఖను రాశారు. మణిరత్నం, అనురాగ్ కశ్యప్, శ్యామ్ బెనగల్, అపర్ణాసేన్, శుభా ముగ్దల్, రామచంద్రన్ గుహ లాంటి హేమాహేమీలు ఉన్నారు. జూలై 23వ తేదీ ఉన్న లేఖను విడుదల చేశారు. ప్రతిఘటన లేకుండా… ప్రజాస్వామ్యం ఉండదని ఆ లేఖలో ప్రముఖులు అభిప్రాయపడ్డారు. జై శ్రీరామ్ అన్న నినాదం ఓ యుద్ధ పిలుపుగా మారిందని విమర్శించారు. మనది శాంతికాముక దేశమని, భారతీయులుగా గర్విస్తున్నామని, కానీ దేశవ్యాప్తంగా జరుగుతున్న హింసాత్మక సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని ఫిల్మ్ ప్రముఖులు ప్రధానికి రాసిన లేఖలో చెప్పారు. 2016లో 840 హింసాత్మక సంఘటనలు జరిగినట్లు ఆ లేఖలో తెలిపారు. ఎక్కువ సామాజిక వర్గానికి రాముడు ఓ పవిత్రమైన వ్యక్తి అని, అలాంటి రాముడి పేరును ఎందుకు నాశనం చేస్తున్నారని లేఖలో తెలిపారు. అయితే సినీ స్టార్స్ రాసిన లేఖను కేంద్ర హోంశాఖ ఖండించింది.
previous post
నాగబాబుకు శివాజీరాజా రిటర్న్ గిఫ్ట్…!