తాగు నీటి కోసం ఆరు దశాబ్ధాలుగా వేచి చూస్తున్న భాగ్యనగరానికి దాహర్తి తీర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ రెడీ అయిపోయింది. కొద్ది సేపటి క్రితం ఈ ప్రాజెక్ట్ని తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహాన్, ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కలిసి ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ వలన వేల ఎకరాలు సశ్యశ్యామలం కానున్నాయి. ఇంతటి మహోజ్వల ఘట్టానికి స్పూర్తి ప్రదాత అయిన సీఎం కేసీఆర్పై ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున “నీరే జీవం… ప్రపంచంలో అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభించినందుకు శుభాకాంక్షలు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీర్ల అద్భుత ప్రతిభకి నిదర్శనం” అని ట్వీట్ చేశారు. ఇక రవితేజ కూడా తన ట్విట్టర్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ “అద్భుతాన్ని సాక్షాత్కరింపజేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు” అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
previous post
“దర్బార్”కు నష్టాలు అన్నది ఓ డ్రామా మాత్రమే… : భారతీరాజా