telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

సీబీఎస్ఈ పరీక్ష తేదీలను ప్రకటించిన కేంద్రం..

students masks exams

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ {సీబీఎస్‌ఈ} 10,12 తరగతులకు పరీక్ష తేదీలను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. మే 4 నుంచి జూన్‌ 10 వరకు పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ ప్రకటించారు. ఈ విషయాన్ని రమేష్‌ పోఖ్రియాల్‌ ట్విట్టర్‌ వేదికంగా పేర్కొన్నారు. మార్చి 1 నుంచి ప్రాక్టికల్స్‌ ఉంటాయని పేర్కొన్నారు. జూలై 15 న పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభించడంతో విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు కొత్త కరోనా వైరస్‌ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో… తల్లిదండ్రులు, విద్యార్థుల అభ్యర్థన మేరకు పరీక్షలను మే నెలలో కేంద్రం జరుపనుంది. ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీ సరిగా లేకపోవడంతో ఆన్‌లైన్‌ తరగతులు సరిగ్గా జరగడం లేదని విద్యార్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. మే 4 నుంచి ఈ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Related posts