అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ ప్రతి శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) న్యాయస్థానానికి హాజరవుతారన్న విషయం తెలిసిందే. అయితే, ఈ రోజు ఆయన కోర్టులో విచారణకు ఆయన హాజరుకాలేదు. ఏపీలో ఓ కేంద్ర మంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ రోజు మినహాయింపు కోరడంతో ఆయన చేసుకున్న అభ్యర్థనను సీబీఐ న్యాయస్థానం అంగీకరించింది.
అక్రమాస్తుల కేసులో తదుపరి విచారణ ఈ నెల 22కి వాయిదా పడింది. కాగా, ఈ కేసులో కోర్టు విచారణకు హాజరవడంపై తనకు మినహాయింపును ఇవ్వాలంటూ జగన్ పెట్టుకున్న పిటిషన్ ఇటీవలే న్యాయస్థానం కొట్టేసిన విషయం తెలిసిందే. కోర్టు విచారణకు హాజరుకావాల్సిందేనంటూ ఆదేశించడంతో ఇకపై ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు హాజరుకావాల్సి ఉంది.
చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు తిరగబడ్డారు: రోజా